TDP: లోకేష్‌ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన

TDP: సారా మరణాలపై శాసనసభలో చర్చకు డిమాండ్

Update: 2022-03-24 05:45 GMT

లోకేష్‌ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన

TDP: మద్య నిషేధంపై మహిళలకు సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా అంటూ టీడీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. కల్తీ సారా మరణాలన్నీ జగన్‌ రెడ్డి హత్యలేనని టీడీపీ ఆరోపించింది. కల్తీసారా మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని లోకేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. మద్యం మరణాలపై శాసన సభలో చర్చించాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుబట్టారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసన మండలి వరకు నిరసన ర్యాలీ చేపట్టిన టీడీపీ నేతలు వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags:    

Similar News