ఛత్తీస్గఢ్లో నక్సల్స్పై నిఘా వేసిన భద్రతాదళాలకు మరో విజయాన్ని తెచ్చిపెట్టింది తాజా ఎన్కౌంటర్. దంతేవాడ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో భారీ నక్సల్ బహుమతి దారురాలు రేణుక అలియాస్ బాను మృతి చెందింది. ఆమెపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. బెదిరింపులు, ప్రొపగండా వీడియోలు, దాడుల ప్రణాళికలు సెట్ చేయడంలో కీలకంగా ఉన్న బాను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన మావోయిస్టు నేతగా గుర్తించబడ్డారు.
ఈ ఎన్కౌంటర్ దంతేవాడ–బిజాపూర్–తెలంగాణ సరిహద్దుల్లో ఉదయం 9 గంటల నుంచి కొనసాగిన భద్రతా బలగాల చర్యల్లో భాగంగా చోటు చేసుకుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, గీడం పోలీస్ స్టేషన్, భైరంఘఢ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అలాగే తెలంగాణ సరిహద్దులోని గ్రామాల నుంచి వచ్చిన పోలీసులు కలసి ఈ ఆపరేషన్ను చేపట్టారు.
వారంగల్కు చెందిన బాను, నక్సల్స్ మీడియా టీమ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారానికి ముక్యంగా వ్యవహరించేది. ఎన్కౌంటర్ అనంతరం ఆమె మృతదేహం నుంచి ఇన్సాస్ రైఫిల్తోపాటు ఇతర ఆయుధాలు, రోజువారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో బస్తర్ రేంజ్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇప్పటివరకు 119 మంది మావోయిస్టులు మృతి చెందారు.