TG Govt: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..2వేల పోస్టులకు నోటిఫికేషన్

Update: 2025-04-04 03:02 GMT

TG Govt: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కొలువుల జాతర షురూ కానుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటగా 2వేల గెజిటెడ్ పోస్టుల భర్తీ, తర్వాత 5వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్ మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఏయే ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తున్న విషయాలన్నీ అందులో పేర్కొంది. కానీ ఆ లూపే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది. ఎస్సీ కులాల్లోని ఆర్థిక, సామాజిక పరిస్థితుల మేరకు ఆయా కులాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఆలస్యం చేయకుండా జ్యూడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు వర్గీకరణ ప్రాసెస్ పూర్తి చేసి దానిని అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకున్నది. ఆ బిల్లు గవర్నర్ సంతకం కోసం రాజ్ భవన్ కు పంపించారు. రెండు మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదించి ప్రభుత్వానికి పంపించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం 2వేల గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఏయే శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ అయిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది.

Tags:    

Similar News