హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీల పెంపు

Toll Fare: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలను పెంచారు. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమల్లోకి వస్తాయి.

Update: 2025-03-31 07:15 GMT

Toll Fare: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలను పెంచారు. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమల్లోకి వస్తాయి. కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికిల్స్ కు కి.మీ.కు 10 పైసలు పెంచారు. మినీ బస్, ఎల్‌సీవీలకు కిలోమీటరకు 20 పైసలు పెంచారు. 2 యాక్సిల్ బస్సులకు కి.మీకు 0.31 పైసలు , భారీ వాహనాలకు 0.69 పైసలు పెంచారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఐఆర్‌బీ సంస్థ 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ప్రతి ఏటా ఐదు శాతం టోల్ ఛార్జీలు పెంచుకొనే వెసులుబాటు ఆ సంస్థకు ఉంది. దీంతో వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది.

దీంతో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఐఆర్‌బీ సంస్థ.ఔటర్ రింగ్ రోడ్డును ఐఆర్‌బీ సంస్థ రూ.7,380 కోట్లకు దక్కించుకుంది. కాంట్రాక్టు దక్కించుకున్న 16 నెలల్లోనే వెయ్యి కోట్లు ఆదాయం దక్కించుకుంది ఆ సంస్థ.ప్రతిరోజూ సగటున ఐఆర్‌బీకి రూ. 2 కోట్ల ఆదాయం లభిస్తోంది.

 ఔటర్ రింగ్ రోడ్డుపై వసూలు చేసే టోల్ ఛార్జీలు

                                             

                                                     ప్రస్తుత ఛార్జీ        ఏప్రిల్ 1 నుంచి ఛార్జీ

కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికిల్స్ : రూ.2. 34                    రూ.2.44

మినీ బస్, ఎల్‌సీవీ:                       రూ. 3.77                   రూ. 3.94

2 యాక్సిల్ బస్సులు:                    రూ.6.69                    రూ.7 

Tags:    

Similar News