తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన గవర్నర్‌

తెలంగాణలో 9 యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించారు గవర్నర్‌.

Update: 2024-10-18 11:17 GMT

తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన గవర్నర్‌

తెలంగాణలో 9 యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించారు గవర్నర్‌. పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్‌ శ్రీనివాస్‌ను నియమించగా.. కాకతీయ వర్సిటీ వీసీగా ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు. అలాగే.. ఉస్మానియా వర్సిటీ వీసీగా ఎం.కుమార్‌, శాతవాహన వర్సిటీ వీసీగా ఉమేష్‌కుమార్‌, హైదరాబాద్‌ తెలుగు వర్సిటీ వీసీగా నిత్యానందరావు, నల్గొండ మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్‌ నియమించబడ్డారు.

నిజామాబాద్‌ తెలంగాణ వర్సిటీ వీసీగా యాదగిరిరావు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ వర్సిటీ వీసీగా అల్దాస్‌ జానయ్య, శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యానవన వర్సిటీ వీసీగా రాజిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు గవర్నర్. 

Tags:    

Similar News