Group-2 : షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలు..గందరగోళంలో నిరుద్యోగులు

Group-2 : రాష్ట్రంలో నిరుద్యోగులకు తిప్పలు తప్పేలా లేవు. గ్రూప్ 2లో ఒక్క పోస్టు కూడ పెంచే ప్రసక్తే కనిపించడం లేదు. కనీసం అలాటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు లేదని తెలుస్తుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

Update: 2024-07-10 02:36 GMT

Group-2 : షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలు..గందరగోళంలో నిరుద్యోగులు

Group-2 :రాష్ట్రంలో నిరుద్యోగులు గళమెత్తుతున్నారు. మొన్న డీఎస్సీ వాయిదా వేయాలని నిరసనకు దిగారు. కానీ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పుడు గ్రూప్ 2లో ఒక్క పోస్టు కూడా పెంచే దాఖలాలు కనిపించడం లేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా ప్రభుత్వం మదిలో ఉన్నట్లు లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతవరకు స్పష్టతను కూడా ఇచ్చారు. నిరుద్యోగులు కోరుతున్నట్లు పరీక్షలు వాయిదా వేసే ఆలోచన కూడా చేయడం లేదని సమాచారం. షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 7 ,8 తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాల వారీగా పరీక్షకేంద్రాలను గతంలో గుర్తించగా..పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ప్రశ్నాపత్రాలతోపాటు పరీక్షల నిర్వహణకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేస్తున్నట్లు టీజీపీఎస్సీ వర్గాలు ద్వారా సమాచారం అందుతోంది. గ్రూపు 2లో 2వేల పోస్టుల సంఖ్యను పెంచుతామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఆ పార్టీ తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.

Tags:    

Similar News