Char Dham Yatra: విషాదయాత్ర.. 52 మంది భక్తులు మృతి
Char Dham Yatra: వాతావరణం తట్టుకోలేక గుండెపోటుకు గురై అధిక మంది మృతి
Char Dham Yatra: చార్ధామ్ యాత్ర తీవ్ర విషాదాన్ని మిగులుస్తుంది. యాత్ర ప్రారంభమైన 15 రోజుల వ్యవధిలోనే 52 మంది భక్తులు మృతి చెందినట్లుగా సమాచారం. వాతావరణం తట్టుకోలేక గుండెపోటుకు గురై అధిక మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారే అధికంగా ఉన్నారు. గంగోత్రిలో ముగ్గురు, యమునోత్రిలో 12 మంది, బద్రినాథ్లో 14 మంది, కేదార్నాథ్లో 23 మంది భక్తులు మృతి చెందారు. చార్ధామ్ వచ్చే భక్తులకు వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. యాత్రికులు ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.