రేపు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

Maoists: బీజాపూర్-మావోయిస్టుల పేరుతో కర పత్రం విడుదల

Update: 2024-05-25 05:06 GMT

రేపు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు 

Maoists: ఛత్తీస్‌గడ్‌‌లో మావోయిస్టుల కరపత్రం.. అలజడిరేపింది. ఛత్తీస్‌గఢ్‌లో రేపు బంద్‌కు పిలుపునిస్తూ.. కరపత్రం.. బ్యానర్లు విడుదల చేశారు. ఆవపల్లి-ఉసూరు.. బీజాపూర్-ఉసూరు రహదారిని నక్సలైట్లు దిగ్బంధించారు. రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లు ఏర్పాటు చేశారు. విష్ణుదేవ్ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకి అని ఆ కరపత్రాల్లో.. బ్యానర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు.

మే 10న పిడియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులు 12 మంది నక్సలైట్లను హతమార్చినట్లు ప్రకటించారు. అయితే.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన 10 మందిని గ్రామస్థులుగా పేర్కొంటూ నక్సలైట్లు బంద్‌కు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News