కర్నూలు జిల్లా హోసూరులో దారుణం... టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య

Kurnool: పాతకక్షలతో మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులును దారుణ హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా హోసూర్‌లో జరిగింది.

Update: 2024-08-14 05:22 GMT

కర్నూలు జిల్లా హోసూరులో దారుణం... టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య

Kurnool: పాతకక్షలతో మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులును దారుణ హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా హోసూర్‌లో జరిగింది. ఉదయం పొలానికి వెళ్లిన సమయంలో శ్రీనివాసులును వేటకొడవళ్లతో నరికి చంపారు. శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త అని పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శాంబాబు... మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబసభ్యులను ఓదార్చి... వారికి అండగా ఉంటామని హామి ఇచ్చారు. హోసూర్ గ్రామానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. గ్రామం ప్రశాంతంగా ఉంటుందని... పార్టీలు వేరైనా గ్రామస్థులందరూ కలిసి మెలసి ఉంటారన్నారు డీఎస్పీ. చనిపోయిన వ్యక్తికి రాజకీయంగా కానీ.... వ్యక్తిగతంగా కానీ శత్రువులెవరూ లేరన్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు డీఎస్పీ శ్రీనివాసులు.

టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్యను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున పనిచేసినందుకు కక్షతోనే శ్రీనివాసులు కళ్లలో కారం కొట్టి కిరాతకంగా హత్య చేశారని ట్వీట్ చేశారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనా... జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగాతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని తెలిపారు. వైసీపీ చేతిలో హతమైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోందని లోకేశ్ భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News