ఏపీలో హింసాత్మక ఘటనలపై డీజీపీకి సిట్ నివేదిక

264 పేజీలతో కూడిన నివేదికకు సమర్పించిన సిట్

Update: 2024-06-11 03:41 GMT

ఏపీలో హింసాత్మక ఘటనలపై డీజీపీకి సిట్ నివేదిక

SIT Report: ఏపీలో ఎన్నికల పోలింగ్‌ రోజు చెలరేగిన అల్లర్ల ఘటనలపై సిట్ అధికారులు డీజీపీకి నివేదిక సమర్పించారు. హింసాత్మక ఘటనలపై 264 పేజీలతో కూడిన పూర్తి నివేదికను రాష్ట్ర డీజీపీకి సమర్పించారు సిట్ అధికారులు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 37 కేసులు నమోదు చేసినట్లు రిపోర్టులో తెలిపారు. ఇందులో 6 కేసుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు సిట్ అధికారులు. నిందితులను ప్రశ్నించకపోవడం, సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడం వంటి అంశాల్లో పల్నాడు జిల్లా పోలీసులు సరిగా వ్యవహరించలేదని సిట్ అధికారులు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News