KTR: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి కథా చిత్రం నడుస్తోంది

KTR: మొత్తం రూ.8,888 కోట్ల అవినీతికి పాల్పడ్డారు

Update: 2024-09-21 12:50 GMT

KTR: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి కథా చిత్రం నడుస్తోంది

KTR: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలోని కేంద్ర పథకమైన అమృత్ పథకం టెండర్లలో 8 వేల 888 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే ఉన్నారని.. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ కుంభకోణం.. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు అమృతంగానూ..రాష్ట్ర ప్రజలకు విషంగా ఉందన్నట్టు పరిస్థితి తయారైందని కేటీఆర్ విమర్శించారు.

Tags:    

Similar News