KCR: కేసీఆర్‌కు మరోసారి పవర్‌ కమిషన్‌ లేఖ

KCR: విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్‌ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది.

Update: 2024-06-26 05:03 GMT

KCR: కేసీఆర్‌కు మరోసారి పవర్‌ కమిషన్‌ లేఖ

KCR: విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్‌ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని పవర్ కమిషన్ ఛైర్మన్ నర్సింహారెడ్డి లేఖ రాశారు. కమిషన్‌కు వచ్చిన సమాచారంపై అభిప్రాయాలు తెలపాలని ఈ నెల 19న కేసీఆర్‌కు లేఖ రాసింది పవర్ కమిషన్. ఈ నెల 27వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది. అయితే తమకు వచ్చిన అభ్యంతరాలకు సంబంధించి ఏదైనా సమాచారం, అభ్యంతరమున్నా వివరణ ఇవ్వాలని లేఖలో కోరారు పవర్ కమిషన్ జస్టిస్ నర్సింహారెడ్డి.

Tags:    

Similar News