Kamareddy: కామారెడ్డిలో ప్రేమజంట ఆత్మహత్య

Kamareddy: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది.

Update: 2024-09-21 07:17 GMT

Kamareddy: కామారెడ్డిలో ప్రేమజంట ఆత్మహత్య

Kamareddy: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరేమోననే మనస్థాపంతో ప్రేమికులిద్దరు వారి గ్రామాల్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ పంట పొలం వద్ద ఉరేసుకోగా, అంబారీపేట్‌కు చెందిన వీణ ఇంట్లో దూలానికి ఉరేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News