KTR: కనీసం రోడ్లు వేసేందుకు మీ దగ్గర నిధులు లేవా?

KTR Tweet: నేడు మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు.

Update: 2024-09-30 06:04 GMT

KTR Tweet: నేడు మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో కేటీఆర్‌ పర్యటించనున్నారు. హైదర్‌గూడ, కిషన్‌బాగ్‌ ప్రాంతాల్లో పర్యటించి.. మార్క్ వేసిన ఇళ్లను పరిశీలించి.. బాధితులతో మాట్లాడనున్నారు కేటీఆర్. రెండు రోజుల క్రితం మూసీ, హైడ్రా బాధితులు హరీష్‌రావును కలిశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎక్స్‌లో కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. కనీసం రోడ్లు వేసేందుకు మీ దగ్గర నిధులు లేవా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలని.. పంచాయతీ కార్యదర్శులు అప్పు చేయాల్సిందేనా అంటూ నిలదీశారు. గ్రామాల అభివృద్ధికి సర్కార్‌ ఏం చేస్తోందని.. ఆసరా పెన్షన్లు సమయానికి రాక అల్లాడుతున్నారని.. ఆసరా పెన్షన్‌తో దాతలుగా సహాయం చేస్తే తప్ప.. తెలంగాణలో రోడ్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఆటకెక్కించారా అంటూ ప్రశ్నించారు.


Tags:    

Similar News