Harish Rao: రేవంత్ రెడ్డి మెదడులో విషం ఉంది.. విజన్ లేదు..

Harish Rao: మూసీ విషయంలో పేదల పక్షాన పోరాడుతున్నందుకే కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి టార్గెట్ చేశారని హరీష్‌రావు ఆరోపించారు.

Update: 2024-10-28 10:26 GMT

Harish Rao: రేవంత్ రెడ్డి మెదడులో విషం ఉంది.. విజన్ లేదు..

Harish Rao: మూసీ విషయంలో పేదల పక్షాన పోరాడుతున్నందుకే కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి టార్గెట్ చేశారని హరీష్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే కేటీఆర్‌పై బురదజల్లుతున్నారన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్‌పై దాడి చేసి రేవ్‌ పార్టీకి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోయాబీన్ రైతుల ఉసురు రేవంత్ రెడ్డి పోసుకుంటున్నాడు

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలు.. రాస్తారోకోలే దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ముందు నోటికొచ్చిన విధంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని ఫైరయ్యారు. వరికి బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారని.. పత్తి రైతులతో సహా మొక్క జొన్న, సోయాబిన్ రైతులను కూడా మోసం చేశారని ఆరోపించారు. రైతులు కలెక్టర్ కాళ్ళ మీద పడే దుస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేసిన ఘనడు రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి మెదడులో విషం ఉంది తప్ప విజన్ లేదన్నారు హరీష్ రావు. 

Tags:    

Similar News