Indiramma Houses: ద‌స‌రాలోపు ఇందిర‌మ్మ క‌మిటీలు.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

Indiramma Houses: ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Update: 2024-09-26 05:31 GMT

Indiramma Houses: ద‌స‌రాలోపు ఇందిర‌మ్మ క‌మిటీలు.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

Indiramma Houses: ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలని, రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ‌, వార్డు, మండ‌ల, ప‌ట్టణ‌, నియోజ‌క‌వ‌ర్గ, జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలను ఒక‌టి రెండు రోజుల్లో రూపొందించాల‌ని సీఎం సూచించారు. అర్హుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. ప్రధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయించుకుంటే... మన రాష్ట్రం వెనుక‌బ‌డి ఉంద‌ని, ఈ ద‌ఫా కేంద్రం మంజూరు చేసే ఇళ్లల్లో రాష్ట్రానికి గ‌రిష్ట సంఖ్యలో సాధించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

పీఎంఏవై కింద రాష్ట్రానికి రావ‌ల్సిన బ‌కాయిలు రాబ‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన స‌మాచారం వెంట‌నే ఇవ్వాల‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల విష‌యంలో డాటాను ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేయాల‌ని సీఎం ఆదేశించారు. పెద్దసంఖ్యలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది స‌మ‌స్య ఎదుర‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని అధికారులు తెల‌ప‌గా... అవ‌స‌ర‌మైతే ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధతిన నియామ‌కాలు చేప‌ట్టాల‌న్నారు.

రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాకులు, ఇళ్లు వేలం వేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఏళ్ల త‌ర‌బ‌డి వృథాగా ఉంచ‌డం స‌రికాద‌ని, వెంట‌నే వేలానికి రంగం సిద్ధం చేయాల‌న్నారు. డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పూర్తయినా... వాటిని ఎందుకు అప్పగించ‌లేద‌ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అర్హుల‌కు ఆ ఇళ్లను అప్పగించాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాకుల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, వాటిని అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్పగించాల‌ని అధికారుల‌కు ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.

Tags:    

Similar News