ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

సమావేశాల నిర్వాహణపై మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ

Update: 2024-07-11 10:54 GMT

ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధికారులతో సమీక్షించారు. సీఎస్‌, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై స్పీకర్, మండలి ఛైర్మన్ పలు సూచనలు చేశారు. సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కేంద్రంలో బ‌డ్జెట్ ప్రవేశ పెట్టిన త‌రువాత‌నే రాష్ట్రంలో బ‌డ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండ‌డంతో అందుకు త‌గ్గట్లు అధికారులు సిద్ధం కావాల‌ని సూచించార‌ు.

Tags:    

Similar News