Arvind Kejriwal: దేశంలో నియంతృత్వ పాలన సాగుతోంది
Arvind Kejriwal: ఉచిత కరెంటును ఆపాలని బీజేపీ చూస్తోంది
Arvind Kejriwal: ఆప్కి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని... దాని కారణంగా రాష్ట్ర హక్కుల కోసం పోరాడలేకపోతున్నామని కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్లోని 13 సీట్లలో ఆప్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో నియంతృత్వ పాలన నడుస్తోందని విమర్శించారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ ఇస్తున్నామని... దాన్ని ఆపాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు ఉచిత కరెంటు ఆపేందుకే అని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్.