West Bengal: కోల్కతా జయనగర్ పోలింగ్ బూత్ దగ్గర టెన్షన్
West Bengal: ఈవీఎం, వీవీప్యాట్లను స్థానిక చెరువులో పాడేసిన గ్రామస్థులు
West Bengal: ఏడోదశ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్కతా జయనగర్ పోలింగ్ బూత్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలతో తమూ కూడా పోలింగ్ బూత్ల్లో కూర్చుంటామని పలువురు ఓటర్ల పట్టు పట్టారు. అందుకు అధికారులు నిరాకరించడంతో ఓటర్ల ఆగ్రహంతో EVM తీసుకెళ్లి చెరువులో విసిరేశారు. జావద్పూర్ పోలింగ్ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. ఉద్రికక్త పరిస్థితుల నేపథ్యంలో కోల్కతాలో పోలీసులు భారీగా మోహరించారు.