బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులను హెచ్చరించిన ఈసీ
రాజ్యాంగం రద్దు వంటి అంశాలను ప్రస్తావించవద్దు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులను ఈసీ హెచ్చరించింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇరుపార్టీల స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్నారని వారిని అదుపులో పెట్టాలని ఆదేశించింది. కులం, భాష, మతంతో ప్రచారం చేస్తున్నారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మతపరమైన అంశాలకు బీజేపీ దూరంగా ఉండాలి సూచించింది. సమాజాన్ని విభజించే ప్రసంగాలను ఆపాలని కోరింది. రాజ్యాంగం రద్దు వంటి అంశాలపై కాంగ్రెస్ మాట్లాడవద్దని చెప్పింది. అగ్నివీర్, రక్షణ దళాలను రాజకీయం చేయవద్దని తెలిపింది.