Kedarnath: కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు
Kedarnath: 18 రోజుల్లోనే 5,09,688 మంది దర్శనం
Kedarnath: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్ర లో భాగంగా ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా భక్తులు బాబా కేదార్నాథ్ను దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఈనెల 10న కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచారు. 18 రోజుల వ్యవధిలో 5 లక్షల 9 వేల 688 మంది భక్తులు బాబా కేదార్నాథుడిని దర్శించుకున్నారు.