Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2024-05-29 12:15 GMT

Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

Delhi Weather: దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ముంగేష్ఫూర్‌లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే.. భారత వాతావరణ శాఖ ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. నిన్న ముంగేష్ఫూర్‌లో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఢిల్లీలో సరాసరి ఉష్ణోగ్రత 47 డిగ్రీలకు పైగా రికార్డయింది.

ఇదిలా ఉంటే.. మరోవైపు.. విద్యుత్‌ వినియోగం రికార్డ్‌ స్థాయికి చేరుకుంది. ఢిల్లీ చరిత్రలో మొదటిసారిగా ఈ ఏడాది విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. 8 వేల 302 మెగావాట్లకు విద్యుత్‌ వినియోగం చేరుకున్నట్టు విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. వరుసగా 7 రోజుల నుంచి ఢిల్లీలో 7వేల మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోంది.

Tags:    

Similar News