Ration Scam: రేషన్ స్కామ్ లో బెంగాలీ సినీ నటి రీతూపర్ణ సేన్ గుప్తకు ఈడీ సమన్లు
Ration Scam: జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
Ration Scam: రేషన్ కుంభకోణంలో బెంగాలీ నటి రితుపర్ణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కోట్లాది రూపాయలు దారి మళ్లించి కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. సమన్లు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రోజు జూన్ 5వ తేదీన కోల్కతా నగర శివారు ప్రాంతంలోని ED కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. అయితే.. రితుపర్ణకు సమన్లు పంపడం ఇదే తొలిసారి కాదు. 2019లో బెంగాల్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మనీ లాండరీంగ్ చేసినట్టు ఆరోపణ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేశాయి.