భూగోళానికి పొంచి ఉన్న గ్రహశకలం ముప్పు
2038 జులై 12న భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా అంచనా
అంతరిక్షం నుంచి భూమివైపు ఓ గ్రహశకలం దూసుకొస్తుందని నాసా వెల్లడించింది. తాజాగా ఈ గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహశకలం పరిమాణం ఎంతనేది ఇంకా తెలియరాలేదని, భూమిని ఢీ కొట్టే ముప్పు మాత్రం 72 శాతం ఉందన్నారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ గ్రహశకలం 2038 జులై 12న భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని వివరించారు. అయితే ప్రస్తుతానికి ఈ ముప్పును తప్పించేందుకు నాసా దగ్గర ఎలాంటి మార్గం లేదని పేర్కొన్నారు.
డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ను ఆవిష్కరించిన నాసా.. ఈ విధానం ద్వారానే ప్రస్తుత ముప్పును గుర్తించింది.