Botsa Satyanarayana: అచ్యుతాపురం ప్రమాద బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం

Botsa Satyanarayana: మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున సాయం

Update: 2024-08-24 15:45 GMT

Botsa Satyanarayana: అచ్యుతాపురం ప్రమాద బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం

Botsa Satyanarayana: అచ్యుతాపురం ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు వైసీపీ తరఫున 5లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే క్షతగాత్రులకు లక్ష అందజేస్తామన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన తీరు సరిగా లేదని బొత్స విమర్శించారు. మృతుల కుటుంబాల దగ్గరకు ఒక్కరైనా వెళ్లారా.. కనీసం వారి సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఘటనపై నిజాయితీగా ఎంక్వయిరీ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.

Tags:    

Similar News