Brahma Reddy: మాచర్లలో టీడీపీ కార్యకర్తలు చొరవ, పౌరుషం కొనసాగించాలి

Brahma Reddy: టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు

Update: 2022-12-19 08:40 GMT

Brahma Reddy: మాచర్లలో టీడీపీ కార్యకర్తలు చొరవ, పౌరుషం కొనసాగించాలి

Brahma Reddy: మాచర్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన పట్టుదల, పౌరుషం ఇకపైనా కూడా కొనసాగించాలని పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. చంద్రయ్య హత్యకేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. పోలీసులు పెట్టే కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మాచర్ల దాడి ఘటనలో తనను కాపాడేందుకు టీడీపీ కార్యకర్తలు చూపిన ధైర్య సాహసాలు జీవితంలో మర్చిపోలేనన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉండలేకపోతున్నానని ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీకి తెలియజేయాలని బ్రహ్మారెడ్డి సూచించారు.

Tags:    

Similar News