Weather Report: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. వారంలోగా తెలుగు రాష్ట్రాలకు..
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
Weather Report: నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. కాగా మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి.
మరో వైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఈ కబురు ప్రజలకు ఊరట కల్పించినట్లయ్యింది.