Chandrababu Naidu: నేడు గుజరాత్ కు ఏపీ సీఎం చంద్రబాబు..

Chandrababu Naidu: రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్న సీఎం

Update: 2024-09-16 04:15 GMT

Chandrababu Naidu: నేడు గుజరాత్ కు ఏపీ సీఎం చంద్రబాబు..

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ వెళ్లనున్నారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్- 2024లో చంద్రబాబు పాల్గొననున్నారు. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులకు... రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు చంద్రబాబు. ఇక ఎనర్జీ రంగంలో పేరున్న పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల... ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చల్లో పాల్గొంటారు. గాంధీనగర్ ఇన్వెస్టర్స్ మీట్‌కు హాజరై.. అక్కడి కార్యక్రమాల్లో పాల్గొని.. అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి అమరావతికి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Tags:    

Similar News