CM Chandrababu: తిరుమలకు పూర్వ వైభవం తీసుకువస్తాం..

Tirumala: తిరుమలకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

Update: 2024-10-05 05:56 GMT

CM Chandrababu: తిరుమలకు పూర్వ వైభవం తీసుకువస్తాం..

Tirumala: తిరుమలకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల పర్యటనలో భాగంగా వకుళామాత అన్నప్రసాద వంటశాలను చంద్రబాబు ప్రారంభించారు. హిందువులకు ప్రతిబింభం తిరుమల క్షేత్రం అన్నారు. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. అంతకు ముందు టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

శ్రీవారి లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, పేటెంట్ ఉందని.. ఎంతో మంది ప్రయత్నించినా తిరుమల లడ్డూ చేయలేకపోయారన్నారు. గతం కంటే శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందన్నారు. త్వరలో లడ్డూతో , ముడిసరుకల నాణ్యతను పరిశీలించే అధునాతన ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. 

Full View


Tags:    

Similar News