Revanth Reddy: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఢిల్లీలో జరిగే CWC సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కాంగ్రెస్ పెద్దలతోనూ సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. తాజాగా లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక తదితర విషయాలపై చర్చిస్తారని సమాచారం. CWC సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొననున్నారు.