ఎమ్మెల్సీలుగా తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్

Update: 2024-06-13 07:33 GMT

ఎమ్మెల్సీలుగా తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్సీలుగా గెలుపొందని నవీన్ రెడ్డి, తీన్మార్ మల్లన్నలు శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశారు. వారితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు యశస్విని, సబితా ఇంద్రారెడ్డిలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్‌లో బీఆర్ఎస్ తరఫున నవీన్ రెడ్డి విజయం సాధించారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపొందారు. 

Tags:    

Similar News