T Congress: బీఆర్ఎస్‎కు భారీ షాక్ ..కాంగ్రెస్‎లోకి ఆరుగులు ఎమ్మెల్సీలు జంప్

T Congress: బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి చేరారు.

Update: 2024-07-05 00:15 GMT

 T Congress: బీఆర్ఎస్‎కు భారీ షాక్ ..కాంగ్రెస్‎లోకి ఆరుగులు ఎమ్మెల్సీలు జంప్

T Congress:బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ లోకి భారీగా ఆ పార్టీలో నుంచి ఎమ్మెల్సీలు చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జీ దీపాదాస్ మున్సీ కూడా పాల్గొన్నారు. ఈమధ్యే శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్ లోకి జాయిన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు బీఆర్ ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. 

Tags:    

Similar News