Uttam Kumar Reddy: పార్వతీబ్యారేజీని పరిశీలించిన మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy:బ్యారేజీలను పరీక్షించేందుకు NDSAకు అప్పగించాం
Uttam Kumar Reddy :మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినా గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన పార్వతీ బ్యారేజిని మంత్రి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న మరమ్మతుల గురించి ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మూడు బ్యారేజీల సామర్థ్యాన్ని పరీక్షించే బాధ్యత NDSAకు అప్పగించినట్లు తెలిపారు. NDSA ఇచ్చిన మధ్యంతర రిపోర్ట్ ప్రకారం.. సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు మంత్రి ఉత్తమ్