Defamation Case: కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో కేటీఆర్ పరువు నష్టం దావా

Defamation Case: కొండా సురేఖపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.

Update: 2024-10-10 11:25 GMT

Defamation Case: కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో కేటీఆర్ పరువు నష్టం దావా

Defamation Case: కొండా సురేఖపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో గురువారం కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 2న కేటీఆర్ పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినీనటులు నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో కేటీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా ఉన్నారని ఆ పిటిషన్ లో ఆయన చెప్పారు.

ఇదే విషయంలో ఇప్పటికే సినీ నటులు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు అక్కినేని నాగార్జునతో పాటు సాక్షుల నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. ఈ పిటిషన్ పై కొండా సురేఖకు నాంపల్లి కోర్టు గురువారం నోటీసులు పంపింది.

Tags:    

Similar News