మూసీపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? భ‌ట్టి విక్ర‌మార్క‌కు జ‌గ‌దీశ్ రెడ్డి స‌వాల్

Jagadish Reddy: హైడ్రా, మూసీ సుందరీకరణ కేంద్రంగా తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది.

Update: 2024-10-08 14:00 GMT

మూసీపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? భ‌ట్టి విక్ర‌మార్క‌కు జ‌గ‌దీశ్ రెడ్డి స‌వాల్

Jagadish Reddy: హైడ్రా, మూసీ సుందరీకరణ కేంద్రంగా తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రెస్ మీట్ల మీద.. ప్రెస్ మీట్లు పెడుతూ..మాటల తూటాలకు పదును పెడుతున్నారు లీడర్లు. తాజాగా ఇదే అంశంపై స్పందించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తాబేదార్ల కోసం హైడ్రా, మూసీ వచ్చిందని ఆ‍యన ఆరోపించారు.

అసలు..మూసీ సుందరీకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగిందా అని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి. చెరువుల విషయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. గూగుల్‌ మ్యాప్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చెరువుల పరిస్థితి ఎలా ఉందో చూద్దామన్నారు.

Tags:    

Similar News