ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

MLC Kavitha: విచారణ జరపనున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్

Update: 2024-05-24 03:25 GMT

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

MLC Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు కవిత ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. బెయిల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హై కోర్టు...జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును.. ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేసింది.

Tags:    

Similar News