Mahesh Kumar Goud: గాంధీభవన్‌లో రేపు, ఎల్లుండి జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు

Gandhi Bhavan: గాంధీభవన్‌లో రేపు ఎల్లుండి టీపీసీసీ మహేష్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి.

Update: 2024-10-14 07:13 GMT

Mahesh Kumar Goud

Gandhi Bhavan: గాంధీభవన్‌లో రేపు ఎల్లుండి టీపీసీసీ మహేష్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, విష్ణునాథ్, విశ్వనాథం హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు టీపీసీసీ చీఫ్. ఆ తర్వాతి రోజైన 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఛైర్మన్‌ల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.

Tags:    

Similar News