CM Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్
CM Revanth Reddy: శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో రేపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. సీఎంతో పాటు ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ సీనియర్ నేతలు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్రెడ్డిలు సైతం సీడబ్ల్యూసీ భేటీకి హాజరుకానున్నారు.