కామ్రేడ్‌లకు షాకిచ్చిన సీఎం కేసీఆర్

Left Parties: ఇవాళ ఉదయం ఇరు పార్టీలు వేరు వేరుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

Update: 2023-08-22 04:06 GMT

కామ్రేడ్‌లకు షాకిచ్చిన సీఎం కేసీఆర్

Left Parties: నేడు వామపక్ష పార్టీలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కామ్రేడ్‌లకు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. సీపీఐ, సీపీఎంలు అడిగిన అన్ని స్థానాలకు.. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. మునుగోడు ఎన్నికల్లో తమతో పని చేయించుకొని.. ఇప్పుడు పట్టించుకోలేదని కామ్రేడ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఇరు పార్టీలు వేరు వేరుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీపీఐ, సీపీఎంల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హాజరుకానున్నారు. ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించనున్నారు.

Tags:    

Similar News