తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర

డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో బోనాలు

Update: 2024-07-07 04:12 GMT

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర హోరెత్తనుంది. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, నెత్తిన బోనాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాలు సంబురాలు షురూ అవుతాయి. ఈ నెల 21న ఉజ్జయిని, 28న లాల్‌దర్వాజా బోనాలు జరగనున్నాయి. ఆగస్టు 4 వరకు బోనాలు పండుగ అంగరంగ వైభవంగా సాగనుంది.

Tags:    

Similar News