IPL 2025: ముంబై ఇండియన్స్‌కు వీడ్కోలు చెప్పనున్న రోహిత్ శర్మ? కొత్త అప్‌డేట్‌తో ఫుల్ క్టారిటీ

సోషల్ మీడియా ప్రకారం ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను తదుపరి సీజన్‌లో ఉంచుకోబోతోంది.

Update: 2024-08-29 13:20 GMT

Rohit Sharma

Mumbai Indians to Retain Rohit Sharma IPL 2025: IPL 2025 ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. అయితే, ఈ మెగా వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా వేలంలో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొననున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ విడుదల చేయవచ్చనే ఊహాగానాలు వేలానికి ముందు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పుడు MI ఫ్రాంచైజీ తన పాత కెప్టెన్‌ను కొనసాగించే మూడ్‌లో ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియా ప్రకారం ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను తదుపరి సీజన్‌లో ఉంచుకోబోతోంది. 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ ఏది కోరుకున్నా అంగీకరించడానికి ఎంఐ మేనేజ్‌మెంట్ సిద్ధంగా ఉందని కూడా వినిపిస్తోంది. అయితే రిటైన్‌ అవుతాడ‌న్న వార్త‌ల‌లో అత‌న్ని మ‌ళ్లీ కెప్టెన్‌గా చేస్తారా లేదా అన్న‌ది నిర్ణ‌యించ‌లేదు. అయితే, ముంబై ఇండియన్స్ లేదా రోహిత్ శర్మ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

గతేడాది కెప్టెన్సీ ఔట్..

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి, హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్‌గా నియమించింది. హార్దిక్‌ను ఎంఐ గుజరాత్ టైటాన్స్‌కు ట్రేడ్ చేసింది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మకు ఎంఐ మేనేజ్‌మెంట్, హార్దిక్ పాండ్యాతో సత్సంబంధాలు లేవని పుకార్లు వచ్చాయి. అదే సమయంలో, హార్దిక్ కెప్టెన్సీలో కూడా, ముంబై పెద్దగా రాణించలేకపోయింది. దీని కారణంగా జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగింది.

రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..

రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌లో ఉండాలా లేదా జట్టును విడిచిపెట్టాలా అనే దానిపై కీలక ప్రకటన చేశాడు. స్టార్ ఆటగాళ్ల కెరీర్‌లో డబ్బు పెద్దగా పట్టించుకోని దశ వస్తుందని, మంచి వాతావరణంలో క్రికెట్ ఆడాలని మాత్రమే కోరుకుంటారని తెలిపాడు.

Tags:    

Similar News