VK Pandian: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకించిన వీకే పాండియన్
బీజేడీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన వీకే పాండియన్
VK Pandian:ఒడిశాలో బిజూ జనతా దళ్ ఓటమికి బాధ్యత వహిస్తూ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆ పార్టీ కీలక వీకే పాండియన్ ప్రకటించారు. ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉండే తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. తనపై వ్యతిరేకంగా జరిగిన ప్రచారమే పార్టీ ఓటమికి కారణమైతే క్షమించాలని బీజేడీ కార్యకర్తల్ని వేడుకున్నారు.
మరోవైపు, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తన వారసుడి విషయంపై స్పష్టతనిచ్చారు. తన వారసుడు ఎవరని అడిగిన ప్రతిసారీ పాండియన్ కాదని చెప్పానని.. అదే విషయం మళ్లీ చెప్తున్నానని అన్నారు. ప్రజలే నా వారసుడిని నిర్ణయిస్తారని తెలిపారు. అయితే నవీన్ స్పష్టత ఇచ్చిన కొన్నిగంటలకే పాండియన్ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేడీని ఓడించి బీజేపీ విజయాన్ని దక్కించుకుంది.