ఢిల్లీలో నీటి సమస్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ అవసరాల కోసం నీటిని విడుదల చేయాలన్న కోర్టు

Update: 2024-06-06 10:25 GMT

ఢిల్లీలో నీటి సమస్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ నీటి కష్టాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీ అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 137 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. నీటి విడుదలను పర్యావేక్షించాలని యమునా రివర్ బోర్డును సుప్రీంకోర్టు కోరింది. జూన్ 10న అందుకు సంబంధించిన రిపోర్టు అందించాలని తెలిపింది. నీటిని వృథా చేయకూడదని ఢిల్లీని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Tags:    

Similar News