Rahul Gandhi: ఎగ్జిట్ పోల్స్పై తమాషా సమాధానమిచ్చిన రాహుల్
Rahul Gandhi: 295 సీట్లలో ఇండియా బ్లాక్ గెలుస్తోందన్న రాహుల్
Rahul Gandhi: లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ను దాటుతుందని చెప్పినా... గెలుపు తమదేనని, తమది పీపుల్స్ సర్వే అని కాంగ్రెస్ చెబుతోంది. ఈ క్రమంలో ఇండియా బ్లాక్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని అడిగినప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తమాషా సమాధానమిచ్చారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా 295 ట్రాక్ ను ప్రస్తావించారు. సిద్ధూ మూసేవాలా సాంగ్ విన్నారా అని ప్రశ్నిస్తూ, 295 సీట్లు...అని చెప్పారు. అవి ఎగ్జిట్ పోల్స్ కావని... మోడీ మీడియా పోల్ అని, ఆయన ఫాంటసీ పోల్ అని విమర్శించారు.