హాట్ మీటింగ్... చంద్రబాబు, స్టాలిన్ భేటీపై రాజకీయవర్గాల్లో చర్చ
Delhi Airport: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Delhi Airport: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబును తమిళనాడు సీఎం స్టాలిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబును కలిసిన విషయాన్ని స్టాలిన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. " ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో చిరకాల మిత్రుడు చంద్రబాబు కలిశాను.. ఆయనకు నా శుభాకాంక్షలను తెలియజేసి, సోదర రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సహకరిస్తాము అని ఆశాభావం వ్యక్తం చేశానని స్టాలిన్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాల కోసం వాదిస్తూ, హక్కులను పరిరక్షిస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని నమ్మకం ఉందంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా నిన్న జరిగిన ఎన్డీయే కూటమి సమావేశానికి చంద్రబాబు వెళ్లగా.. అదే సమయంలో ఇండియా కూటమి సమవేశానికి డీఎంకే తరపున స్టాలిన్ హాజరయ్యారు. తిరిగి వెళ్లేసమయంలో ఎయిర్పోర్ట్లో ఇద్దరు కలిశారు. మరోవైపు నిన్న నితీష్ కుమార్, తేజస్వీయాదవ్ కూడా ఒకే విమానంలో ప్రయాణించారు. వేర్వేరు కూటమిలకు చెందిన నేతలు ఇలా కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వేర్వేరు కూటమిలకు చెందిన నేతలైనా... స్నేహపూర్వకంగా.. కలవడం.. రాజకీయ స్పూర్తిని చాటారు.