Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌‌ను కర్ణాటక సీఎం సిద్దరామయ్య పరిశీలించారు.

Update: 2024-08-13 13:27 GMT

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌‌ను కర్ణాటక సీఎం సిద్దరామయ్య పరిశీలించారు. కట్టను పరిశీలించిన ఆయన డ్యాం పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఇంజినీర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 70 ఏళ్ల చరిత్రలో గేట్‌ కొట్టుకుపోవడం ఇదే తొలిసారి అన్నారు సిద్దరామయ్య.

రేపటి నుంచి గేట్ ఏర్పాటు మొదలు అవుతుందని తెలిపారు. నీళ్లు రిజర్వ్ చేసేలా చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మొదటి పంటకు ఇబ్బంది లేదని.. డ్యామ్‌ గేటు ఏర్పాటు చేసి వర్షాకాలంలోపు నింపేలా చర్యలు తీసుకుంటామన్నారు సిద్ధరామయ్య. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags:    

Similar News