పండగకు ఊరెళ్తూ కారు ఓవర్‌టేక్.. 12 మంది దుర్మరణం

Update: 2024-09-06 14:45 GMT

Hathras Road Accident: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా - అలీఘడ్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయిన కారు ఎదురుగా వస్తున్న బస్సుని వేగంగా ఢీకొంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలోనూ కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బస్సు, కారు రెండూ కూడా అతివేగంగా వచ్చి ఎదురెదుగా ఢీకొనడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

హత్రాస్ జిల్లా కేంద్రానికి సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ కుమార్, జిల్లా ఎస్పీ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హత్రాస్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెల్లవారితే వినాయక చవితి సెలవు కావడం, ఆ మరునాడే ఆదివారం సెలవు కావడంతో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు ఇంటికి వస్తున్న వారే ఈ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడినట్లుగా సమాచారం అందుతోంది.

Tags:    

Similar News