తమిళనాడులో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలోఉన్న ప్లైఓవర్

12 మంది కార్మికులను రక్షించిన రెస్క్యూ టీమ్‌

Update: 2024-09-22 05:52 GMT

తమిళనాడులో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలోఉన్న ప్లైఓవర్

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. 12 మంది కార్మికులను సురక్షితంగా రక్షించారు. అయితే.. వీరిలో బిహార్‌కు చెందిన నరేష్‌కు తీవ్రగాయాలు కాగా.. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపత్తూరు జిల్లా అంబూర్‌ బస్టాండ్‌ ఎదురుగా ఈ ఘటన జరిగింది.

Tags:    

Similar News