Rahul Gandhi: దేశం పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మారింది

Rahul Gandhi: దేశం పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మారింది

Update: 2024-07-29 13:30 GMT

Rahul Gandhi: దేశం పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మారింది

Rahul Gandhi: కేంద్ర బడ్జెట్‌పై లోక్​సభలో చర్చ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ. దేశం పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మారిపోయిందని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వారిపై అదనపు భారం వేశారని రాహుల్ విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేసినా.. వారికి స్పష్టమైన హామీ లభించలేదన్నారు. కేంద్రం విధానాలు చూసి రైతులు భయపడుతున్నారన్నారు రాహుల్. అగ్నివీర్‌లను సైతం కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు. వారి పింఛను కోసం బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.

Tags:    

Similar News