Arunachal Pradesh: కొనసాగుతున్న అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్లో రికార్డు స్థాయిలో 82.95శాతం పోలింగ్
Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమైంది. అరుణాచల్లో ఇప్పటికే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికవగా.. మిగతా 50 స్థానాలకు లెక్కింపు జరుగుతోంది. మరోవైపు సిక్కింలోనూ 32 స్థానాల భవితవ్యం తేలనుంది. అరుణాచల్ ప్రదేశ్లో రికార్డు స్థాయిలో 82.95శాతం పోలింగ్ శాతం నమోదు కాగా...సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో 79.88శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఈ రెండు రాష్ట్రాల లోక్సభ స్థానాల ఫలితాలు 4వ తేదీన వెల్లడవుతాయి.